ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా వైయస్ జగన్ పొలిటికల్ ఎత్తుగడలు ఉన్నాయని టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళ్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఆయనకు అండగా ఉంటున్న వర్గాన్నే జగన్ ఇప్పుడు పావుగా వాడుకుంటూనట్లు ఏపీ మీడియా సర్కిల్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబుకి మొదటి నుండి అండగా కమ్మ సామాజిక వర్గం ఆశీస్సులు ఉన్నాయని చాలా మంది చెప్పుకొస్తారు. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్లంతా ఫీల్ అవుతారని కూడా కొంతమంది నేతలు అంటుంటారు.
అటువంటి వర్గాన్ని చంద్రబాబుకి దూరం చేయటానికి కమ్మ సామాజిక వర్గంలో కీలక రాజకీయ నాయకుడిగా పేరుపొందిన వల్లభనేని వంశీ ద్వారా జగన్ సరైన స్కెచ్ చంద్రబాబు పై వేసినట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కమ్మ సామాజిక వర్గం లో చాలా మంది ప్రముఖులు రాజకీయ నేతలు వ్యాపార వేత్తలు సినిమా హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లంతా దాదాపు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఉంటారన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు పై అమరావతి విషయంలో ఇంకా చాలా బయటపడుతున్న కుంభకోణాల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న తరుణంలో కమ్మ సామాజిక వర్గం లో చీడపురుగు చంద్రబాబు అనే రీతిలో…., చంద్రబాబు వల్లే కమ్మ సామాజిక వర్గానికి చెడ్డపేరు వస్తుంది అన్న విధంగా వల్లభనేని వంశీ ద్వారా ఆరోపణలు జగన్ చేయిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన, ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు పై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడిన్నా సంగతి తెలిసిందే. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైసిపిలో ఉన్న కమ్మ నాయకుల చేత జగన్ వేసిన స్కెచ్ అని టాక్ నడుస్తోంది. ఏదో రీతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా దూరం చేయడానికి…వైసీపీలో ఉన్న కమ్మ నేతలనే బాబు పై ఎగదోస్తూన్నట్లూ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా ఇప్పటికే కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గంలో ఉండే కీలక నాయకులను వైసీపీలో చేర్చడానికి తెర వెనకాల కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కలిసి సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. మరోపక్క టిడిపి ప్లేస్ ని రీప్లేస్ చేయాలని చూస్తున్న బీజేపీ నేతలు కూడా కమ్మ సామాజిక వర్గం లో ఉన్న ప్రముఖు నేతలను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకి ఉంటుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?