ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా ఎదిగిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం పార్టీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన వీళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఈ ముగ్గురు రావడం వల్ల చంద్రబాబు ని విమర్శించడం తప్ప పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కానీ గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి ఎంట్రీ విషయంలో మాత్రం గతం లో చేరిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలా మాదిరిగా కాకుండా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి పూర్తిగా రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారట. గంటా రాజీనామా చేయడానికి గల కారణం జగన్ స్మూత్ వార్నింగ్ అని సమాచారం.
పూర్తి విషయంలోకి వెళితే విశాఖపట్టణంలో కీలక పారిశ్రామికవేత్తగా రాజకీయ నేతగా పేరొందిన గంటా శ్రీనివాస్ రావు అదే ప్రాంతంలో టీడీపీ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉందే వర్గం వారితో మంచి సత్సంబంధాలు ఉండటమేనని టాక్. దీంతో పార్టీ లోకి రావాలంటే కచ్చితంగా పదవికి మరియు టీడీపీకి రాజీనామా చేసి రావాలని జగన్ షరతులు విధించారట. అంతేకాకుండా ఒక వేళ పార్టీలో చేరకుండా టీడీపీ లోనే కొనసాగితే రాజధాని విశాఖ కి వచ్చాక వ్యాపార పరంగా మరియు రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని గంటకి జగన్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. దీంతో ఉత్తరాంధ్రలో తన అనుచర వర్గంతో కలిసి ఆగస్టు నెలలో గంటా శ్రీనివాస్ జగన్ సమక్షంలో వైసీపీ లోకి రాబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.