వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇటీవల అత్యుత్సాహంగా ఏకంగా న్యాయవ్యవస్థపై విమర్శలు చేసే రీతిలో వ్యవహరించడంతో జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పట్ల వైసీపీ అధిష్టానం వివరణ ఇచ్చే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. అయితే ఈ తరుణంలో కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ వైసీపీ పెద్దలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యంగా న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించటం మంచి పరిణామం కాదని కేంద్ర మంత్రులు జగన్ కి చురకలు అంటించినట్లు వార్తలు వచ్చాయి.
ఇంత రాద్ధాంతం జరిగినా ఇటీవల కృష్ణా జిల్లా ప్రాంతంలో కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు న్యాయ వ్యవస్థ పై విమర్శలు చేసే రీతిలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కృష్ణాజిల్లాలో మాత్రమే కాకుండా ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. కాగా రాష్ట్రంలో జరుగుతున్న మత మరియు న్యాయ వ్యవస్థ వంటి విషయాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందే వైసిపి అధిష్టానం హెచ్చరించింది అట.
కానీ వాటినన్నిటినీ బేఖాతరు చేస్తూ కృష్ణాజిల్లాలో దూకుడుగా ఎమ్మెల్యేలు న్యాయవ్యవస్థపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం జరిగిందట. ఈ విషయంలో ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా రావడంతో ఇంటిలిజెన్స్ వర్గాలను కృష్ణాజిల్లా లో జగన్ దింపినట్లు టాక్. ఎమ్మెల్యేల కదలికలపై దృష్టిపెట్టినట్లు…. న్యాయ వ్యవస్థ పై విమర్శలు ఎమ్మెల్యేల గత పది రోజుల షెడ్యూల్ ఏంటో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ వర్గాల ఆదేశాలు జగన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్త మీడియా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రావడంతో కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?