పాలనాపరంగా సంక్షేమ పథకాల రూపంలో జగన్ ప్రజలకు బాగానే అందిస్తున్న మరోపక్క ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. జగన్ ఏడాది పరిపాలనలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 50 సార్లకు పైగానే ఆయన తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఈ పరిణామాలతో న్యాయస్థానాల సాక్షిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జగన్ సర్కార్ తీసుకుంటుందని అటు ప్రజల లోనూ వ్యతిరేకత ముద్ర ఏర్పడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది.
మొదటి నుండి ఈ విధంగా న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తగులుతున్నా ఎక్కడ లోపం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వ సలహాదారులు ఇచ్చే ఐడియా లో లోపముందా లేకపోతే జగన్ మొండితనం గా వ్యవహరిస్తూ కోర్టులలో మొట్టికాయలు వేయించుకుంటున్నారా ..? అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రకటిస్తున్న టైంలో నిర్ణయాలు అద్భుతంగా ఉన్నా గాని అవి న్యాయస్థానం ముందుకి వెళ్లే పటికి ప్రభుత్వంపైనే వ్యతిరేకత ముద్ర వేయించేలా ఉండటంతో జగన్ చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని ఆలోచించి సరైన నిర్ణయాలు ఇవ్వాలనే టాక్ ఎప్పటినుండో వైసీపీలో వినబడుతోంది.
తాజాగా ప్రతి ఆఫీస్ కి వైసిపి పార్టీ మూడు రంగులు వెయ్యడం విషయంలో గతంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కూడా షాకే తగిలింది. హైకోర్టు చెప్పింది కరక్టే… నాలుగు వారాల్లోగా రంగులు మార్చకపోతే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. వరుసగా ఇన్ని పొరపాట్లు జరుగుతున్న తరుణంలో జగన్ చుట్టూ ఉన్నవాళ్లే ప్రభుత్వ సలహాదారులే పెద్ద డ్యామేజ్ చేస్తున్నారు అన్న వాదన పార్టీలో బలంగా వినబడుతోంది.