2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి తరఫున మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అదరగొట్టే రీతిలో పొలిటికల్ లుక్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు. ప్రతి చోటా కార్యకర్తలకి మంచి జోష్ వచ్చే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ చెలరేగిపోయారు. ఆ సమయంలో జరిగిన మహానాడులో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగానికి చాలామంది భవిష్యత్తు టిడిపి అధ్యక్షుడు అతనే అని డిసైడ్ అయిపోయారు.
కానీ ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందటం తర్వాత పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి గ్యాప్ రావడంతో పాటు మొత్తం తన దృష్టంతా సినిమాలపైనే పెట్టేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ వరుస విజయాలతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో చాలావరకు సినిమా ఇండస్ట్రీ నుండి పొలిటికల్ రంగంలోకి వచ్చేవారు ఎక్కువగా మొదట సేవా కార్యక్రమాలు చేస్తూ తర్వాత ప్రజాస్వామ్యంలో పోటీకి దిగుతుంటారు.
ఇప్పుడు ఇదే ఫార్ములా జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించడానికి రెడీ అయినట్లు అటు సినిమా వర్గాలలో ఇటూ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ విశాఖపట్నం లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో కళ్యాణ్ రామ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకుని టిడిపి మద్దతుదారులు అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు ఇక జగన్ కి మరియు చంద్రబాబు కి చెమటలే అని సోషల్ మీడియాలో అంటున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి గ్రౌండ్ వర్క్ జూనియర్ ఎన్టీఆర్ ప్రిపేర్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?