అమరావతి: ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ చంద్రబాబు, జగన్, పవన్లు పోటా పోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఇవాళ ఉగాది కార్యక్రమాలు, మేనిఫెస్టో విడుదలతో ప్రచారానికి విరామం ప్రకటించిన జగన్..రేపు యధావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు గాజువాకలో ఆయన ప్రచారం చేయనున్నారు. గాజువాక నుంచి జనసేన పార్టీ అధినేత ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో చంద్రబాబు, బాబు బరిలోకి దిగుతున్న కుప్పంలో జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు జగన్ పవన్ పోటీ చేస్తున్న గాజువాకపై ఫోకస్ పెట్టారు.
గాజువాకను హోరెత్తించేలా భారీ రోడ్డు షోను నిర్వహించాలని వైసిపి స్థానిక నేతలు సన్నద్ధమవుతున్నారు. గాజువాకలో ఇప్పటికే రోడ్ షో తోపాటు బహిరంగ సభ కూడా నిర్వహించి పార్టీలో శ్రేణుల్లో పవన్ జోష్ నింపారు.
వైసిపి తరఫున గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి ఉండగా.. టిడిపి నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.