ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందు నుండి తన పరిపాలనలో అవినీతి లేకుండా చాలా ఓపెన్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఆ విధంగానే అమలయ్యేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానని మాట ఇవ్వటమే కాకుండా అదే రీతిలో పాలన చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల జగన్ కి అసహనం కలిగించినట్లు పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్. ముఖ్యంగా రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఉండే మంత్రులు ఎంత చెప్పినా కూడా అవినీతి వ్యవహారాల్లో తలదూర్చడం వంటి విషయాలు ఇటీవల జగన్ దృష్టికి వచ్చాయట.
పరిస్థితులు ఇలా ఉండగా మరో పక్క కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విపక్షాలు ఏ విషయంలో ఏపీ ప్రభుత్వం దొరుకుతుందా అనే విధంగా పరిస్థితిలో ఉన్న తరుణంలో…ముందు జాగ్రత్తగా మంత్రులందరికీ గట్టిగా క్లాస్ పీకే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అవినీతి ఆరోపణలు వచ్చిన రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలకు చెందిన మంత్రుల విషయంలో మాత్రం జగన్… అవసరమైతే విచారణ చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ విచారణ మంత్రుల సమావేశానికి ముందు చేసే విధంగా జగన్ ..వైసీపీ పార్టీలో ఉండే పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పరిపాలన పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతుండగా… మంత్రుల అవినీతి.. ప్రభుత్వంపై ప్రజలకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా జగన్ ఏపీ మంత్రులకు త్వరలోనే గట్టిగా క్లాస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.