Telangana Assembly : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయ రెడ్డి తో అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు మరియు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో ప్లకార్డులతో అసెంబ్లీలోకి అనుమతులు లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని మార్షల్స్ అడ్డుకోవడం జరిగింది. ప్లకార్డు లతోనే లోపలికి వెళతాను, లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అని పట్టుబట్టడంతో.. అయినా కానీ మార్షల్స్ ఒప్పుకోకపోవడంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నారు.