విజయవాడ, జనవరి 10: రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాల్ అంటూ, దానిని ఎదుర్కొనేందుకు జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం కడప జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చూసినా రాజకీయం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయింది. ఈ కుటుంబాలు స్వలాభం కోసం రాజకీయాలు చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నారు
మనం ఎదుటి వారిని ప్రశ్నించాలంటే మనకు నైతిక బలం ఉండాలి
జనసేనకు యువత, మహిళలు అండగా ఉన్నారు. వారి అండతో మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లగలమన్న నమ్మకం ఉంది.
జనసేన నిర్వహించిన కవాతుకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛదంగా తరలివచ్చారంటే అది వారిలోని ఆగ్రహాన్ని తెలియపరుస్తున్నదని పవన్ అన్నారు.
సంక్రాంతి పండుగ తరువాత సంస్థాగత కమిటీల నియామకం చేస్తా
రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పు కోసం జనసైనికులు కృషి చేయాలి
జనసేన యువత రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుందనీ, వారిని రాజకీయ శక్తిగా మార్చే బాధ్యతను తీసుకుంటానని పవన్ అన్నారు.