ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు మంచి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. గతంలో బిజెపి పార్టీ రాష్ట్రంలో ఉన్న గానీ పెద్దగా యాక్టివ్ గా రాణించిన పరిస్థితులు ఎక్కడా కనబడలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చాలావరకు బిజెపి టిడిపి కనుసన్నల్లో నడిచినట్లు చాలామంది భావించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కొత్త అధ్యక్షుడిగా రంగంలోకి దిగిన సోము వీర్రాజు ఒకపక్క చంద్రబాబు ని ఏకిపారేసి, మరోపక్క రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రాష్ట్రంలో గెలవడం గ్యారెంటీ అన్న రీతిలో కామెంట్లు చేశారు.
అంతే కాకుండా బిజెపి ఏపీలో విజయబావుటా ఎగురవేసిన తరువాత ముఖ్యమంత్రి పదవిని జనసేన పార్టీకి చెందిన కామన్ అభ్యర్థికి ఢిల్లీ బీజేపీ నేతలు కేటాయించినట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో తెలిసినా కూడా మిత్రపక్షం అయిన బీజెపీ ఇలా మాట్లాడడం సరికాదని సోము వీర్రాజు వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు. కామన్ అభ్యర్థి అని చెప్పడం ఏంటి ? పవన్ నే నెక్స్ట్ సీఎం అని ప్రకటించాలని అభిమానులు పేర్కొంటున్నారు.
దీంతో సోము వీర్రాజు జనసేన శ్రేణులను ఉత్తేజపరచడం కోసం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. పవన్ కళ్యాణ్ ని కామన్ అభ్యర్థి అన్నట్టు మాట్లాడటం పై సోము వీర్రాజు ని జనసైనికులు ఏకిపారేస్తున్నారు. బిజెపి లో అధ్యక్షుడిగా ఫుల్ గా దున్నేయచ్చు అని రంగంలోకి దిగిన సోము వీర్రాజు కి ఆదిలోనే జనసేన సైనికులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం తో… జనసేన తో డీలింగ్ విషయంలో సోము ఇకనుండి ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడట. కాగా ఇప్పుడు ఈ విషయం బీజేపీ శ్రేణుల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై అదే రీతిలో సోము పై జనసేన కార్యకర్తలు విమర్శలపై పవన్ కళ్యాణ్ ఏ మాత్రం స్పందించకుండా చాలా సైలెంట్ గా ఉండటం ఏపీ రాజకీయాలలో పెద్ద సస్పెన్స్ గా మారింది.