అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యక్షతన నేడు పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. గెలుపుఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ. సంస్థాగతంగా బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్, ముత్తంశెట్టి కృష్ణారావు, హరిప్రసాద్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నేటి నుండి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకూ రోజుకు రెండు మూడు జిల్లాల నేతలు, అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?