అమరావతి: జనసేన పార్టీ నుండి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ నేడు పార్టీ అధినేత పవన్ కళ్యణ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ పడమట లంకలోని పవన్ కళ్యాణ్ నివాసానికి రాపాడ వెళ్లి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. రాపాకను సాదరంగా ఆహ్వనించిన పవన్ కళ్యాణ్ ఆయనతో కొద్దిసేపు చర్చించారు. శాసనసభలో పార్టీ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.
రాపాక ఒక్కరే శాసనసభలో జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.