అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఫిట్మెంట్ 50శాతానికి పెంచాలని కోరుతూ ఆర్టిసి ఐక్యకార్యాచరణ కమిటి ఫిబ్రవరి ఆరవ తేదీనుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది.
కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమ్మెను విరమింపజేయాలని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్రెడ్డి కోరారు. సమ్మె వల్ల సామాన్య జన జీవనంపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
కార్మికుల పోరాటంలో జనసేన శ్రేణులు అండగా నిలవాలని పార్టీ అధినేత పవన్కళ్యాణ్ పిలుపునిచ్చారని ఆయన తెలిపారు.
ఆర్టిసి యాజమాన్యం కార్మికులకు 20శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా కార్మికులు సమ్మె చేపడుతున్నట్లు ఆర్టిసి ఐకాస తెలిపింది.