తమిళ రాజకీయాలలో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయి హిస్టరీ క్రియేట్ చేసింది దివంగత జయలలిత. 2016వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా చనిపోయిన జయలలిత వలన తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జయలలిత మరణం తో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితి అప్పట్లో చోటుచేసుకున్నాయి. జయలలిత మరణం తర్వాత చాలా వరకూ తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు అద్భుతమైన రాజకీయ నేతను కోల్పోయినట్టు చాలా సందర్భాలలో పేర్కొనటం జరిగింది. జయలలిత బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాలు ఈ విధంగా ఉండేవి కాదని అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆమె అందించేదాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత స్మృతులను మిస్ అవుతున్న వారి కోసం ఆమె చిరకాలం గుర్తుండి పోయేలా పళని స్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికార నివాసంగా మార్చాలని పళని స్వామి డిసైడ్ అయ్యారు. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పళనిస్వామి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా అనేక విమర్శలకు తెరలేపింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోయెస్ గార్డెన్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం…ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో కొత్తేమీ కాదని న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది.