హైదరాబాద్, మార్చి 7 : ప్రముఖ సినీ నటి, మాజీ ఎంఎల్ఏ జయసుధ టిడిపికి గుడ్బై చెప్పారు. వైసిపిలో చేరారు.
గురువారం లోటస్ పాండ్లో జగన్తో జయసుధ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిక అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ…‘జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు నడుచుకుంటాను. వైసిపిలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది’ అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ.. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మళ్ళీ పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూశారు. 2016లో టిడిపిలో చేరిన జయసుధ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా వైసిపిలో చేరారు.