అమరావతి: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి నూరు రోజుల పరిపాలన తీరును మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకర రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం అయన మీడియా ముందు జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న పలు చర్యలను సమర్ధిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నూరు రోజుల పరిపాలనకు నూరు మార్కులు వేస్తున్నట్లు దివాకర రెడ్డి చెప్పారు. ‘అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మావాడే.అంతే కాదు మావాడు చాలా తెలివైన వాడు’ అంటూ దివాకర రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ను చేయి పట్టుకొని నడిపించేవాడు కావాలని జెసి అన్నారు. జగన్ అడిగితే సలహాలు ఇస్తానని కూడా జెసి అన్నారు.
ప్రతి అంశాన్ని పరిశీలించి లోపాలను సరి చేయాలి గానీ నేలకేసి కొట్టద్దని జెసి అన్నారు. ఆర్ టి సి విలీనం ప్రభుత్వానికి అదనపు భారమని జెసి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం కూడా వ్యాపారం చేయకూడదనీ, అధికారం చెలాయించాలని జెసి అన్నారు. ఉద్యోగులను విలీనం చేయడం వ్యాపారం చేయడమేనని జెసి అభిప్రాయపడ్డారు.