Jc Diwakaar Reddy : జేసీ కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు..!!
Jc Diwakaar Reddy : అనంతపురం మాజీ ఎంపీ టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మేటర్ లోకి వెళ్తే జేసీ దివాకర్ రెడ్డి భార్య విజయ హైకోర్టులో వేసిన పిటిషన్ ను తాజాగా కొట్టేసింది. అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎంతో పేరొందిన జేసీ కుటుంబం వ్యాపారాల్లో కూడా విజయవంతంగా రాణిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ట్రావెల్స్ వ్యాపారంతో పాటు మైనింగ్ వ్యాపారం లో ఆరితేరిన జేసీ ఫ్యామిలీ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో బైరటీస్ గనుల్లో అనుమతి తీసుకున్న దానికంటే లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వుకున్నాట్లు వచ్చిన ఆరోపణలపై గనులశాఖ దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం తో వచ్చిన ఆరోపణలు వాస్తవమే అని నిర్ధారణ కు వచ్చింది. దీంతో 100 కోట్ల జరిమానా విధించడం మాత్రమే కాక ఆస్తులు జప్తు చేస్తామని జెసి ఫ్యామిలీకి గనుల శాఖ నోటీసులు అప్పట్లో జారీ చేయడం జరిగింది.
ఈ విషయం నడుస్తూ ఉండగానే 2019లో పుట్లూరు మండలంలోని యెల్లుట్ల గ్రామపరిధిలోని 2 హెక్టార్లలో బెరైటీస్ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ జేసీ కుటుంబం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే వీళ్ళ పై ఉన్న అక్రమ మైనింగ్ ఆరోపణలు కారణంగా దరఖాస్తులు ప్రభుత్వం ఓటు వేయడం జరిగింది. దీంతో వెంటనే కోర్టును ఆశ్రయించిన జేసీ కుటుంబానికి తాజాగా న్యాయస్థానం జేసీ ఫ్యామిలీ వేసిన కేసును కొట్టేసింది. ఖనిజ సంపదను చెట్లు మరియు ప్రకృతి సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు పౌరులపై ఉందని అంశాలను దృష్టిలో పెట్టుకొని జేసీ ఫ్యామిలీ దాఖలు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.