Ys Jagan : తెలుగుదేశం పార్టీ హయాంలో జేసీ దివాకర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ వైయస్ జగన్ ని భారీ స్థాయిలో విమర్శించిన దాఖలాలు అందరికీ తెలిసిందే. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన తనయుడు మీడియా ముందు ..రాజకీయాల్లో జగన్ ని ఎవరు అనని తరహాలో పరుష పదజాలంతో ..విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావటంతో సీన్ మొత్తం మారిపోయింది. జెసి బ్రదర్స్ ట్రావెల్స్ విషయంలో వాహనాల కాగితాలకు సంబంధించి అవకతవకల కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన తనయుడు జైలు పాలు కావటం మాత్రమేగాక రాజకీయంగా అనేక ఇబ్బందులు జేసీ ఫ్యామిలీ మొన్నటి వరకూ ఎదుర్కుంటూ ఉంది.
అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో జేసీ బ్రదర్స్ నియోజకవర్గం తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గెలిచిన గాని జెసి బ్రదర్స్ ఉన్నా దగ్గర టిడిపి గెలవడంతో ఈ వార్త సంచలనం అయ్యింది. ఇలాంటి తరుణంలో జెసి దివాకర్ రెడ్డి తాజాగా వైయస్ జగన్ పై భారీ స్థాయిలో డైలాగులు సెటైర్లు వేశారు. మేటర్ లోకి వెళ్తే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన జేసీ దివాకర్ రెడ్డి అక్కడి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. చాలా కాలం తర్వాత తెలంగాణ అసెంబ్లీకి వచ్చినట్టు చెప్పుకొచ్చారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదని అన్నారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం పట్ల..కాంగ్రెస్ పై కూడా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే పార్టీ చనిపోయినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమరావతి భూముల విషయంలో చంద్రబాబుకి సిఐడి నోటీసులు ఇవ్వడం పట్ల జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు కాబట్టి ఒక పేజీ తోనే సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే వైయస్ జగన్ కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఏకంగా లారీలో నోటీసులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ జెసి దివాకర్ రెడ్డి ఎటకారం అయినా కామెంట్లు జగన్ పై చేయటంతో..ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.