Jc Prabhakar reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు వైసిపి కైవసం చేసుకోగా అనంతపురం తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రం టిడిపి ఖాతా లో పడింది. ఎమ్మెల్యే ఎంపీ గా చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేసి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుని తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జగన్ అండ్ కో అనేక ఇబ్బందులు పెట్టినా గానీ ఎక్కడా బెదరకుండా .. పోటీ చేసిన నాయకులకు ధైర్యం చెప్పి వాళ్లకి వెన్నుదన్నుగా నిలబడి ..తాడిపత్రి మునిసిపాలిటీ లో టిడిపి జెండా ఎగిరేలా చేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి పార్టీ శ్రేణులు ..నాయకులు బెదరకుండా ఎక్కడైతే ఎదుర్కొన్నారు అక్కడ పార్టీ గెలుస్తుంది క్యాడర్ వారికి తోడుగా ఉంది అని తాడిపత్రిలో మున్సిపల్ స్థానాని గెలుచుకోవటం పట్ల విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటె జగన్ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకెళ్లడం అదేవిధంగా రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలలో జగన్ పై రివెంజ్ తీర్చుకునే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని తాజా విజయంపై తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారట. ఇదే ఊపు కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ జెసి ఫ్యామిలీ హవా కొనసాగడం గ్యారెంటీ అని జిల్లా రాజకీయాల్లో టాక్.