Jc Prabhakar reddy :అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించిందని భయబ్రాంతులకు గురి చేసిందని ఆరోపణలు చేశారు. అందువల్లే అన్ని స్థానాలు వైసీపీ మద్దతు దారులు గెలిచినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో ఓడిపోవడానికి కారణం కూడా ఇదే అని స్పష్టం చేశారు. కుప్పంలో ఎవరిని నామినేషన్లు వేయకుండా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచి వైసిపి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇదే రీతిలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిందని ఆరోపించారు.
ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన వాలంటీర్లు ఎన్నికలలో వైసీపీకి ప్రజల చేత ఓటు వేయించి విధంగా మారారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థలు ఉండకూడదు వెంటనే తీసేయాలి అంటూ సంచలన కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి నాయకులు అంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ భయబ్రాంతులకు గురి కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో రాణిస్తే కనుక రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఎక్కువ స్థానాలు గెలవటం గ్యారెంటీ అంటూ జోస్యం చెప్పారు. ఏదిఏమైనా రాష్ట్రంలో జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల అవకతవకలు జరుగుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?