అమరావతి, జనవరి 7: రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ గెలిస్తే నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల విరాళం ఇస్తానని తెలిపారు. ఏపి రాజధానిగా మారిన తరువాత విజయవాడకు తొలిసారిగా వచ్చానని పాల్ అన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన అన్నారు. దేశంలో అన్ని మతాల వారు భయంతో బతుకున్నారనీ. దేశంలో క్రైస్తవులు, ముస్లింలు అనేక మంది తనకు మద్దతు పలుకున్నారని అన్నారు. ఏపీలో తాను సేవ చేయని గ్రామం లేదనీ, పకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చానని పాల్ తెలిపారు.
తనతో కలిసి వచ్చే పార్టీలకు ఐదు పది సీట్లు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.