అమరావతి: ఇవిఎంల పనితీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిఎంలలో రష్యన్ చిప్స్ అమర్చారని పాల్ ఆరోపించారు.
ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని పాల్ పేర్కొన్నారు. ఓటర్లు తమ పార్టీ హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్కి పడిందని పలువురు తెలిపారని పాల్ అన్నారు.
ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని పాల్ విమర్శించారు. ఇక్కడి వైసిపికి అనుకూలంగా కేంద్రంలోని మోది పని చేస్తున్నారని పాల్ అన్నారు.
నరసాపురంలో రీపోలింగ్ నిర్వహించాలని పాల్ డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పాల్ తెలిపారు.