KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కెఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఒక్క తెలంగాణాకి మాత్రమే కాదు దేశానికి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి అని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటకు రావాలని సూచించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేశవ్యాప్తంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల విషయంలో 48 పరిమితమైందని.. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30కి లేదా 20 కి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల కంటే మనకు దేశం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జాతీయ రైతు నాయకుడు రాకేష్ టికయత్ పై జరిగిన దాడిని కూడా ఖండించారు. మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి గురించి రాజిరెడ్డి గొడవల మధ్య జరిగిన వివాదం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు అదేవిధంగా మాటల దాడులు కూడా తప్పేనని పేర్కొన్నారు. ఈ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు చివరన రెడ్డిని తొలగించనున్నట్లు గుర్తు చేశారు.
దేశంలో రాజకీయ పార్టీలనీ కుల మతాలను రెచ్చగొడుతున్నారు రాజకీయాలు చేస్తున్నాయని.. కానీ ప్రపంచంలో మన దేశం నెంబర్వన్ స్థానంలో ఉండాలని అది నా కల అంటూ కెఏ పాల్ చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలల నుండి అమెరికా నుండి ఇండియాకి వచ్చాక చాలా వరకు కెఏ పాల్.. తెలంగాణ రాజకీయాలలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా కేఏపాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?