KCR KA Paul: “ప్రజాశాంతి” పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రైతు సమస్యల పట్ల ఇంకా అనేక విషయాల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో సంచలన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్ననే సిరిసిల్ల ప్రాంతం వైపు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో కేఏ పాల్ నీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చేయి చేసుకోవడం కూడా జరిగింది.
దీంతో అప్పటి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పై కీలకంగా కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతమాత్రమే కాకుండా అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయి తనపై జరిగిన దాడిని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నీ ఉద్దేశించి కేఏ పాల్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. వచ్చే ఏడాది తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ సీఎంగా కాదు కదా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవరని కేఏ పాల్ జోస్యం చెప్పారు.
అప్పట్లో ప్రజలను రెచ్చగొట్టి.. వారి ఆత్మ బలిదానాలతో సీఎం అయిన కేసీఆర్.. తర్వాత అమరవీరుల కుటుంబాలను మర్చిపోయి.. మోసం చేశారని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ తరఫున అమరవీరుల కుటుంబాలకు 20 సీట్లు కేటాయిస్తున్నట్లు కేఏ పాల్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ ది కాదు అమరవీరులది అని చెప్పుకొచ్చారు. దీంతో కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?