అమరావతి, జనవరి 24: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటు పంచాయితీ ఎట్టకేలకు ముగిసింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించారు.
వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతారని వారు తెలిపారు. కడప పార్లమెంట్, జమ్మలమడుగు అసెంబ్లీ విషయంలో చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఎవరికి సీటు ఇచ్చినా పరస్పరం గెలుపునకు కృషి చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, విప్ రామసుబ్బారెడ్డిలు వెల్లడించారు.
ఒకరు పార్లమెంట్కు, మరొకరు అసెంబ్లీకి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా..
జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికే ఇద్దరు నేతలు ఇప్పటి వరకూ పట్టుబట్టారు. త్వరలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకొని వారిని కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నాయకులూ తెలియజేశారు.