Kamal Hassan : తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు భారీ ఎత్తున నగదును ఆశ చూపుతున్నారు. ఈ క్రమంలో పట్టుబడుతున్న డబ్బుకు లెక్కలు కూడా లేకపోవటంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా కమల్ హాసన్ “మక్కల్ నీది మయ్యం” పార్టీ ట్రెజరర్ చంద్రశేఖరన్ ఇంటిపై అదేవిధంగా అదే పార్టీకి చెందిన కీలక నేతల నివాసాలపై మరియు పార్టీ కార్యాలయాలపై గత మూడు రోజులుగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. తనిఖీలలో పెద్ద ఎత్తున డబ్బు దాచి పెట్టినట్లు సమాచారం. దాదాపు 11 కోట్ల రూపాయలు ఐటి అధికారులు స్వాధీనం చేసుకోవటం జరిగిందట.
తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున గుట్టాల గుట్టాలగా డబ్బుల కట్టలు దొరుకుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు దొరికిన డబ్బులు సీజ్ చేశారు. కమల్ “మక్కల్ నీది మయ్యం” పార్టీకి చెందిన నాయకుల నివాసాలలో భారీ ఎత్తున డబ్బులు దొరకటంతో.. ఈ వార్త తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అధికారికంగా 11 కోట్లు అంటే అనధికారికంగా ఇంకా ఎంత డబ్బు దాచి పెట్టారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇతర పార్టీలకు చెందినవారు.
దీంతో ఐటీ దాడులలో డబ్బులు భారీ ఎత్తున దొరకటంతో ఆదాయపు పన్ను శాఖ కూడా అలర్ట్ అయింది. దాదాపు ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల డబ్బు దొరికినట్లు ..వీటికి లెక్క కూడా లేదన్నట్లు సమాచారం. చెన్నై, కాంచీపురం, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్ సహా పలు జిల్లాల్లో.. కదిలిస్తే చాలు కరెన్సీ కట్టలు భారీ ఎత్తున పట్టుకుంటున్నారు పోలీసులు.