అమరావతి, మార్చి 1: వాల్తేర్ డివిజన్ను వేరు చేస్తూ, విశాఖ జోన్ ప్రకటించడం వల్ల దాదాపు ఆరువేల కోట్ల రూపాయల సరుకు రవాణా ఆదాయం పోయి, కేవలం 500కోట్ల రూపాయల ప్రయాణీకుల ఆదాయం మాత్రమే రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తూ బహిరంగ సవాల్ విసిరారు.
రైల్వే జోన్ ఆదాయం ఏ లెక్కన రాష్ట్రానికి వస్తుందో బహిరంగ చర్చకు రావాలంటూ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పోస్టు చేశారు.
“ స్టిక్కర్ బాబు, నీ అనుభవం తగలెయ్య, ఏమి ఆశించి ఇంత నీచనికి దిగజారి మాట్లాడుతున్నావ్ ?, జోన్ ఆదాయం రాష్ట్రానికి ఎలా వస్తుందో బహిరంగ చర్చకు వస్తావా ?,
నువ్వు గోబెల్స్కి మనవడివి..దుష్ర్పచారానికి కవలవి..అబద్దానికి అన్నవి..నిజానికి శత్రువువి..తూ నీ బతుకు చెడా” అంటూ ట్వీట్ చేశాడు.