అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన దీక్షకు దిగారు. పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి ఆయన దీక్షకు కూర్చున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న కన్నా… ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షకు దిగారు. కన్నా మౌన దీక్షకు సంఘీభావంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు దీక్షకు దిగారు. గంటసేపు ఈ దీక్ష కొనసాగనుంది.
previous post
next post