తిరుపతి, జనవరి 26: రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించకపోతే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మీనారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారని విమర్శించారు.
ఈ మూడు నెలల్లో ఏడేళ్ల కాలానికి సంబంధించి పనులకు పనులకు శంకుస్థాపనలు చేయడం, కాంట్రాక్టర్లకు మోబలైజేషన్ అడ్వాన్స్లు ఇప్పించి, కమీషన్లు దండుకునే కార్యక్రమం ఉంటుందని ఆయన విమర్శించారు. ప్రజల డబ్బులతోనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయాలన్న ఎత్తుగడ టిడిపి చేస్తుందని ఆయన విమర్శించారు.
ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాయిలాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ దుబారాగా ఖర్చు పెడుతుందని ఆయన విమర్శించారు.