ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కురసాల కన్నబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం గురించి మాట్లాడుతూ ఆయిల్ పామ్ ధరలో అక్క తెలంగాణ రాష్ట్రం వ్యత్యాసం తగ్గించేందుకు 80 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయిల్ పామ్ కి మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా రైతాంగానికి మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా దగ్గరయ్యే రీతిలో చర్యలు తీసుకోబోతున్నట్లూ స్పష్టం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే టైంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురించి కన్నబాబు సంచలన కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటన జరిగితే చంద్రబాబు మహదానందం పొందుతున్నారని విమర్శించారు. అంతర్వేదిలో రథం దగ్ధం అయితే చంద్రబాబు ఆనందానికి అవధులు లేవు అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా భక్తిశ్రద్ధలతో శ్రీవారికి పట్టువస్త్రాలు జగన్ సమర్పిస్తే ఆయనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
గతంలో కులాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలను చేసిన చంద్రబాబు ప్రస్తుతం మతాలను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎన్నో గుళ్ళు గోపురాలనీ రోడ్ల విస్తరణ అభివృద్ధి అంటూ కూల్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. జగన్ ఢిల్లీ టూర్ విషయంలో టిడిపి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజలకే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంకా తానే ప్రభుత్వాన్నినడుపుతున్నట్లు భావిస్తున్నారని…. ఆ కలల ప్రపంచం నుండి బయటకు రావాలని ఎద్దేవా చేశారు.