బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ జెడిఎస్ పార్టీల మధ్య లోక్ సభ అ సీట్ల పంపిణీ ఒక కొలిక్కి వచ్చింది. 20 స్థానాల్లో కాంగ్రెస్, ఎనిమిది స్థానాల్లో జెడిఎస్ పోటీ చేసేందుకు అంగీకారానికి వచ్చాయి.
ముఖ్యమంత్రి కుమారస్వామి 12 స్థానాలు కావాలని తొలుత డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చివరకు ఎనిమిది స్థానాల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేశారు.
జేడీఎస్, కాంగ్రెస్ మధ్య అ సీట్ల సర్దుబాటు జరగలేదని దేవగౌడ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అవగాహన కుదిరింది.