Ys Jagan: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే MLA BZ జమీర్ అహ్మద్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘమని కర్ణాటక మీడియా చానల్స్ వద్ద స్పష్టం చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులని..ఇటువంటి టైం లో జగన్ ముఖ్యమంత్రి అవడం .. ..లక్ అని పేర్కొన్నారు. కీలక సమయంలో అద్భుతమైన పరిపాలన ఏపీ ప్రజలకు జగన్ అందిస్తున్నారని MLA BZ జమీర్ అహ్మద్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శం అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. కరోనా ని ఆరోగ్యశ్రీలో పెట్టడం మాత్రమే కాక…కరోనా టెస్ట్ లకి ధరలు ప్రభుత్వం నిర్ణయించిందని.. ఎక్కడ కూడా వైద్యులు ప్రజలను దోచుకోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే రీతిలో జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని .. MLA BZ జమీర్ అహ్మద్ వైసీపీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో.. కరోనా కట్టడి చేయడం కోసం జగన్.. ఇప్పటికే 18 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూ విధించినా సంగతి తెలిసిందే. మరోపక్క వ్యాక్సిన్ కొరత తీర్చడానికి ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలతో జగన్ మంతనాలు జరుపుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా కరోనా చికిత్సలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి కోసం.. రాష్ట్రంలో ఆక్సిజన్ ఎప్పుడూ నిల్వ ఉండేలా.. సింగపూర్ దేశం నుండి టన్నులకొద్దీ దిగుమతి చేసుకునేలా జగన్ ప్రభుత్వం రెడీ అయిందట.. ఏదిఏమైనా ప్రపంచ దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి నుండి తనను గెలిపించిన ప్రజల కోసం జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చుట్టుప్రక్కల ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు కూడా జగన్ కి నిరాజనాలు పలుకుతున్నారు.