దసరా పండుగ తెలుగ రాష్ట్రాల్లో మునుపటి ఉత్సాహంతో సాగడం లేదనే సంగతి తెలిసిందే. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్. కరోనా ఎఫెక్ట్తో ఈ ఏడాది దసరా కాస్త కళ తప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడం లేదు.
అయితే, ఎలాగోలా సొంతూరుకు వెళ్లైనా.. పండగ జరుపుకుందామని అనుకుంటున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయి. మామూలుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పుడే.. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ సమయంలోనే పాలకులు ఒకింత ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
లాక్ డౌన్ ముందు నిలిచిపోయిన ఏపీ, టీఎస్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇప్పటికి పునరుద్ధరణ జరగలేదు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీసం దసరాకైనా ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఏపీకి వచ్చేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. తెలంగాణ-ఏపీ బోర్డర్ నుంచి బస్సులు నడుపుతున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. ఇదే సమయంలో.. టీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ సరిహద్దు వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్టులు – పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెంల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
ప్రైవేట్ ట్రావెల్స్కు పండుగ
మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్కు మాత్రం దసరా.. అసలైన పండగగా మారిపోయింది. దసరా నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. బెజవాడ నుంచి హైద్రాబాద్కి వెయ్యి నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అయితే రాను, పోను టికెట్లు తీసుకున్న వారికి స్వల్ప రాయితీలు కూడా ఇచ్చేస్తున్నాయి. కాకినాడ- హైదరాబాద్కి బస్సు టిక్కెట్ సాధారణంగా నాన్ ఎసికి రూ.600- 650 చొప్పున వసూలు చేస్తారు. అదే ఏసీ బస్సులకు రూ.వెయ్యి వరకూ ఉంటుంది. కానీ ప్రస్తుతం నాన్ ఎసికి వెయ్యి నుంచి రూ.1,500, ఎసి బస్సులకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై కనీసం రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకూ అదనంగా భారం పడుతోంది. దీనికితోడు లగేజీ ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధనలున్నప్పటికీ చిన్న చిన్న లగేజీలకు కూడా రూ.200కిపైగా వసూలు చేసేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?