NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్, జ‌గ‌న్ స‌ర్కారు… మ‌న కోసం చేసే గొప్ప ప‌ని ఇదే

ద‌స‌రా పండుగ తెలుగ రాష్ట్రాల్లో మునుప‌టి ఉత్సాహంతో సాగ‌డం లేద‌నే సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే క‌రోనా ఎఫెక్ట్‌. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది దసరా కాస్త కళ తప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడం లేదు.

అయితే, ఎలాగోలా సొంతూరుకు వెళ్లైనా.. పండగ జరుపుకుందామని అనుకుంటున్న వారిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోచుకుంటున్నాయి. మామూలుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పుడే.. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ దోపిడీ మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ స‌మ‌యంలోనే పాల‌కులు ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగించే నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌త్యేక ఏర్పాట్లు

లాక్ డౌన్ ముందు నిలిచిపోయిన ఏపీ, టీఎస్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇప్పటికి పునరుద్ధరణ జరగలేదు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీసం దసరాకైనా ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఏపీకి వచ్చేవారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. తెలంగాణ-ఏపీ బోర్డర్‌ నుంచి బస్సులు నడుపుతున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. ఇదే సమయంలో.. టీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ సరిహద్దు వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్టులు – పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెంల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.

ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండుగ

మ‌రోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌కు మాత్రం దసరా.. అసలైన పండగగా మారిపోయింది. దసరా నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఛార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. బెజవాడ నుంచి హైద్రాబాద్‌కి వెయ్యి నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ అయితే రాను, పోను టికెట్లు తీసుకున్న వారికి స్వల్ప రాయితీలు కూడా ఇచ్చేస్తున్నాయి. కాకినాడ- హైదరాబాద్‌కి బస్సు టిక్కెట్‌ సాధారణంగా నాన్‌ ఎసికి రూ.600- 650 చొప్పున వసూలు చేస్తారు. అదే ఏసీ బస్సులకు రూ.వెయ్యి వరకూ ఉంటుంది. కానీ ప్రస్తుతం నాన్‌ ఎసికి వెయ్యి నుంచి రూ.1,500, ఎసి బస్సులకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై కనీసం రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకూ అదనంగా భారం పడుతోంది. దీనికితోడు లగేజీ ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధనలున్నప్పటికీ చిన్న చిన్న లగేజీలకు కూడా రూ.200కిపైగా వసూలు చేసేస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?