KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగస్తులకు 30 శాతం పిఆర్సి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో పిఆర్సి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు నిరసనలు చేపట్టారు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం కమిటీ వేసి 30 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి తెలంగాణా ఉద్యోగస్తులు ఈ విషయంపై పోరాడుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాలతో కెసిఆర్ సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమయంలో అనేక విషయాల గురించి కేసీఆర్ వారితో మాట్లాడారు. ఆ తర్వాత తాజాగా ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగస్తులకు 30 శాతం పిఆర్సి పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం జరిగింది. కరోనాతో వేతన సవరణతో ఆలస్యం జరిగిందని తెలిపారు. త్రిసభ్య కమిటీ పీఆర్సీ విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు