హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభా పక్ష నేతగా ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు, పార్లమెంటరీ, రాజ్యసభా పక్ష నేతగా సీనియర్ నేత కె కేశవరావులను ఎంపిక చేశారు. ప్రగతి భవన్లో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
గతంలో లోక్సభాపక్ష నేతగా జితేందర్ రెడ్డి, ఉప నేతగా వినోద్ వ్యవహరించారు. వీరిద్దరు ఈ సారి సభ్యులుగా లేకపోవడంతో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చించారు.
సామాజిక సమీకరణలు, అనుభవం, విధేయతను దృష్టిలో పెట్టుకొని కె కేశవరావును పార్లమెంటరీ పక్ష నేతగా కొనసాగించగా, టిడిపి తరపున లోక్సభాపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉండటంతో నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు.
లోక్సభ, రాజ్యసభలలో ఒక్కొ ఉపనేత, ఒక్కో విప్ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.