KCR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగస్తులు వేతనాల సవరణలు అదేవిధంగా వయోపరిమితి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగస్తుల పాత్ర మరువలేనిది అని కేసీఆర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సకలజనుల సమ్మె విషయంలో ఉద్యోగస్తులు.. కీలకంగా రాణించారని పేర్కొన్నారు.
ఎన్ని బెదిరింపులు వచ్చినా సాహ సోపేతమైన పాత్ర పోషిస్తూ జైతెలంగాణ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పిఆర్సి విషయంలో త్రిసభ్య కమిటీ సూచన మేరకు 30 శాతం పెంచినట్లు స్పష్టం చేసిన కేసిఆర్ ఉద్యోగస్తుల పదవీ విరమణ విషయానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని 61 సంవత్సరాలకు పెంచుతూ కెసిఆర్ ప్రకటన చేయడం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంకా అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించారు.