దేశంలో కొత్త విద్యుత్ సంస్కరణల బిల్లు తీసుకురావడానికి పార్లమెంటులో బిజెపి రెడీ అవుతోంది. కొత్త విద్యుత్ బిల్లును ఆమోదిస్తే…. రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ వ్యవస్థ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా కొత్త విద్యుత్ బిల్లు వల్ల వ్యవసాయ దారుల పై భారం పడే అవకాశం ఉన్నట్లు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ రైతులకు కొత్త మీటర్లు బిగించాలి అనే రీతిలో ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు రావడం జరిగాయి. నగదు బదిలీ పధకం కింద జగన్ సర్కార్ విద్యుత్ బిల్లుల డబ్బు రైతు అకౌంట్లో పడే రీతిలో నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
ఈ నిర్ణయం పై ఏపీ విపక్షాల నుంచి అదేవిధంగా రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చాలా వరకు రైతు బిల్లు కట్టిన తరువాతే ఆ రైతు ఎకౌంట్ లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందనే మెలిక ఉంటుందని చాలామంది అంటున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విద్యుత్ సంస్కరణలకు ఏ మాత్రం పార్లమెంట్లో గాని రాష్ట్రంలో గాని తీసుకు రాకుండా డిసైడ్ అయినట్లు సమాచారం.
విద్యుత్ సంస్కరణల విషయంలో జగన్ కి విపక్షాల నుండి అదేవిధంగా రైతాంగం నుండి వ్యతిరేకత వచ్చే రీతిలో దెబ్బ తగలడం చూసి కేసీఆర్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలకి రెడీ అయినట్టు, దీంతో ఏమాత్రం కొత్త విద్యుత్ సంస్కరణలు అమలు రాష్ట్రంలో చేయకూడదని డిసైడ్ అయిందట. అంతేకాకుండా ఇప్పటికే పార్లమెంటులో ఆ బిల్లు వస్తే వ్యతిరేకిస్తామని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణలో ఇప్పటికే 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి ఇస్తుంది. ఇలాంటి తరుణంలో మీటర్లు పెడితే రైతులపై మరింత భారం పడుతుందని ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కేసిఆర్ కొత్త మీటర్ ల విషయంలో వెనక్కి తగ్గటం జరిగినట్లు తెలుస్తోంది.