ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేసిన కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ… దాని ఎఫెక్ట్ క్రమక్రమంగా ప్రజల మీద పడుతుంది. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఆర్థికపరిస్థితి కోలుకునేందుకు దశాబ్దాలు పడుతుంది అని అంటున్నారు. ఇక ఇలాంటి సమయంలో చిన్న పిల్లల భవిష్యత్తు పై ఈ కరోనా మరింత ప్రభావం చూపించింది…
రిస్క్ తీసుకొని సక్సెస్ అయ్యారు…!
దాదాపు ఎనిమిది నెలలు స్కూలు లేక చదువుకి దూరమైనా చిన్నారుల అంతా సక్రమంగా బడులకు వెళ్ళడం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటు గవర్నమెంట్ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్ క్లాసులకు పిల్లలు పెద్దగా అలవాటు పడలేకపోయారు అనే చెప్పాలి. ఇక మొదట్లో ఎన్నో ఒడిదుడుకుల ను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత నిదానంగా తన నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ముందుకు సాగింది. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో కూడా తగిన నిర్దేశా లతో బడులు ఓపెన్ చేయడం మొదలుపెట్టారు.
ఛాన్సే లేదు…
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే ఎంతో విచిత్రంగా అతను ఆ ధైర్యం చేయలేకపోయాడు. రెండవ కరోనా వేవ్ దగ్గర పడింది అని అనుకున్నాడో లేదా పిల్లల ప్రాణాలను లో రిస్క్ పెట్టడం మంచిది కాదు అని డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం ఈ విద్యా సంవత్సరం కూడా బడులను ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పేశాడు. గత సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థులను గ్రేడింగ్ విధానంలో పాస్ చేయాలని మొట్టమొదట నిర్ణయించుకుంది కెసిఆర్ అన్న విషయం గుర్తు చేసుకోవాలి అలాంటి కేసీఆర్ మినిస్ట్రీ లోని విద్యా శాఖ మంత్రి ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా బడులు తెరుచుకునేది అసాధ్యం అని తేల్చి చెప్పేశారు.
ఎంత వరకు కరెక్ట్..?
ఇక అసలు విషయానికి వస్తే ఆన్లైన్ క్లాసులు ద్వారా చెప్పే చదువులు అంతంత మాత్రం అన్నది వాస్తవం. పైగా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సదుపాయం రాష్ట్రంలో చాలా మంది పిల్లలకి లేదు. అంతే కాకుండా ఇప్పుడు 1 నుండి ఐదవ తరగతి చదివే పిల్లలందరినీ ఎటువంటి పరీక్ష లేకుండా పాస్ చేసేందుకు ఫిక్సయ్యారు. ఇక 6 నుండి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థుల భవిష్యత్తు ఏమిటో తెలియదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే వారికి వారి భవిష్యత్తు చదువులపై ఈ ప్రక్రియ చాలా ప్రభావం చూపుతుంది. మరి కెసిఆర్ పూర్తిగా బడులను మూసి వేయకుండా మరొక ప్రత్యామ్నాయం తో వచ్చి ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొంతమంది ఇలాంటి సమయంలో ఇదే కరెక్ట్ నిర్ణయం అని అంటున్నారు. మీ వాదన ఎటు?