KCR Rahul: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 6వ తారీఖున తెలంగాణ పర్యటన చేపట్టడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో పర్యటన నిమిత్తం మే ఆరవ తారీఖు సాయంత్రం రాహుల్ హైదరాబాద్ కి చేరుకొనున్నారు. ఆ తర్వాత శంషాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వరంగల్ లో రైతుల తో సమావేశం కానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకొని.. ఏడవ తారీకు ఉస్మానియా యూనివర్సిటీ లో పర్యటించడానికి రాహుల్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా షాక్ ఇవ్వడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పరిణామంతో విద్యార్థి సంఘాలు.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ పర్యటనకి అనుమతి ఇవ్వకపోవటం పై నిరసన తెలపటంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో విద్యార్థి సంఘాల నాయకులను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి తీవ్రతరంగా మారటంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. అరెస్టయిన విద్యార్థి సంఘాల నాయకులను.. జగ్గారెడ్డి ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్ పర్యటన అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేసీఆర్ ఒక పిరికి పాలకుడు అని మరో 12 నెలలో.. ఆయన పాలనకు పుల్ స్టాప్ పడనుందని తెలిపారు. ఇదే సమయంలో అరెస్టయిన విద్యార్థి నాయకులను జగ్గారెడ్డిని పరామర్శించడానికి జూబ్లీ హిల్స్ వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డి.. కూడా కేసీఆర్ పై సీరియస్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ తన సొంత జాగీరుగా కెసిఆర్ భావిస్తున్నారని ధ్వజ మెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకూడా ఇటువంటి పరిస్థితులు రాలేదని.. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం నిర్మించిన విద్యాసంస్థలు అని ఉత్తం తెలిపారు. ఏది ఏమైనా సాధారణ పార్లమెంటు సభ్యుడిగా సామాన్య పౌరుడిగా కచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన చేపడతారని చెప్పుకొచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?