కరోనా సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కట్ చేసిన జీతాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించడానికి సిద్ధమైంది. బకాయిల చెల్లింపు విధానాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రకటిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. పెన్షనర్లకు రెండు నెలల్లో బకాయిలు చెల్లించనున్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో ఈ బకాయిలు చెల్లించడానికి రెడీ అయ్యారు. ఉద్యోగులకు అధికారులకు మాత్రం నాలుగు నెలలలో కట్ చేసిన జీతాలను చెల్లించడానికి రెడీ అవుతున్నారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల వారీగా చెల్లింపులు జరపటానికి తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ప్రారంభంలో లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ఖజానకి రాబడి లేకపోవటంతో కేసీఆర్ అప్పట్లో ఉద్యోగులకు జీతాలు కట్ చేయడం జరిగింది.
దీంతో ఆ సమయంలో కట్ చేసిన జీతాలు తిరిగి చెల్లించడానికి కేసీఆర్ సర్కార్ రెడీ అవటంతో ఈ గుడ్ న్యూస్ తెలుసుకొని ఉద్యోగస్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రీతిగానే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా పెన్షనర్లకు మాత్రం డబ్బు ఆపలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక ఖజానా మళ్లీ గాడిలో పడటంతో కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.