తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018 సంవత్సరంలో రెండోసారి విజయం సాధించడం అందరికి తెలిసిందే. ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం స్థాపించాలని ఉంటుందని అనేక వార్తలు వచ్చాయి కానీ వాటన్నిటినీ తలదన్నే రీతిలో కేసీఆర్ సర్కార్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా తక్కువ స్థానాలు గెలవటం తో పాటు బిజెపి కీలక స్థానాల్లో గెలవటం సంచలనం సృష్టించింది. దీంతో ఎన్నో సెంటిమెంట్లు కలిగిన వాస్తు కారణంగా కెసిఆర్ అప్పట్లో 2019 సంవత్సరంలో జూన్ చివరి వారంలో పాత సచివాలయ భవనాలను కూల్చివేసి కేసీఆర్ కొత్త భవంతుల శంకుస్థాపన చేయడం జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదు. కానీ తాజాగా మళ్లీ 19 నెలల తర్వాత సచివాలయ నిర్మాణ ప్రాంతానికి ఇటీవల కేసీఆర్ రావటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొత్త సచివాలయం పనులు బాధ్యత తీసుకున్న ముంబైకి చెందిన షాపూరస్ జీ పల్లోంజీ కంపెనీ శరవేగంగా జరుపుతోంది. ఈ కొత్త సచివాలయం నిర్మాణం కోసం దాదాపు 617 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ సచివాలయ ప్రాంగణానికి రావటం పనులు వేగం పెంచాలని అత్యంత నాణ్యతతో చేయాలని సూచించటం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన జాతకానికి అనుకూలంగా కొత్త సచివాలయ భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు అందుకుగాను కేసీఆర్ తాజాగా పర్యటించి నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.