ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దుబ్బాకలో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక కావడంతో రామలింగారెడ్డి కుటుంబం నుండి ఆయన భార్యకు గాని కుమారుడు నీ ఉప ఎన్నికకు నిలబెట్టి ప్రతిపక్షాలను కేసిఆర్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో ఏకపక్షంగా జరగాల్సిన ఈ ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటీకి దిగాయి.
దీంతో ముందు నుండి దుబ్బాక నియోజకవర్గం చాలా వరకు టిఆర్ఎస్ పార్టీకి ఫెవర్ గా ఉండటంతో కేసిఆర్ ఉప ఎన్నిక ప్రకటించడంతో…. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కేసీఆర్ పొలిటికల్ గేమ్ ప్లాన్ లో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నట్లు తేలింది. కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని చాలామంది ప్రజలు నమ్ముతున్న తరుణంలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఇలాకాలో ఉప ఎన్నిక ప్రకటించి సరికొత్త స్ట్రాటజీ వేశారని మేధావులు చెప్పుకొస్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గం లో జరిగే ఎన్నికలలో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. అసలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి సరైన క్యాడర్ కూడా లేదు. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తో పోటీపడి కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఓడిపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు అనే స్పష్టత ప్రజలలోకి వెళ్తుంది. చాలా తెలివిగా కెసిఆర్ వేసిన ఈ ఉపఎన్నిక ఎత్తుగడలో ప్రతిపక్షాలు బోల్తా పడ్డాయని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్, బిజెపి అక్కడ పోటీకి నిలవకుండా ఉంటే కథ వేరేలా ఉండేదని భావిస్తున్నారు. మరోపక్క కరోనా ని ఎదుర్కొనే విషయంలో టిఆర్ఎస్ విఫలమయ్యింది అన్న వ్యతిరేకతని స్టాండ్ గా ఉంచుకుని దాని ద్వారా ఈ రెండు పార్టీలు పోరాడితే టిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఎదుర్కొనేది అంటూ విశ్లేలిస్తున్నారు. కానీ మధ్యలో కేసిఆర్ ఉపఎన్నిక తెచ్చి టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని సరికొత్త స్ట్రాటజీ టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు వెళ్లి…. కాంగ్రెస్, బీజేపీలను పోటీలోకి దించేలా రాజకీయం చేసి అద్భుత రాజకీయ చాణక్యం ప్రదర్శించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.