మిగిలిన రాష్ట్రాల కన్నా మిన్నగా కరోనాను తెలంగాణ నుంచి తరిమేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ తరచూ చెబుతుంటారు.అవసరమైతే ఐదు వేల కోట్ల రూపాయలనైనా ఈ రోగ నివారణ కి ఖర్చుపెడతానని అసెంబ్లీలోనే ఆయన ప్రకటించారు.
మాటలు సంగతి పక్కన పెట్టి.. వాస్తవం ఎలా ఉందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తాజాగా ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో భారీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి పది కౌంటర్లను ఏర్పాటు చేయటం.. ఒక్కో కౌంటర్ వద్దకు వెళ్లేందుకు వీలుగా ఇనుప మెట్లను సిద్ధం చేశారు. ఇంతకీ ఈ వాహనం చేసే పనేమిటంటే.. ట్రైన్లలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా విధిగా.. ఈ మొబైల్ వాహనం వద్ద తమ శాంపిల్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ శాంపిల్ లో వచ్చే ఫలితం ఆధారంగా వారిని క్వారంటైన్ కు పంపాలా? హోం క్వారంటైన్ కు పంపాలా? ఆసుపత్రికి పంపాలన్నది డిసైడ్ చేస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ వాహనం లాంటివి ఏపీలో ఏకంగా ఇరవై ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు.. బస్టాండ్లు.. ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేశారు.ఒక్క విజయవాడలోనే ఇలాంటి బస్సులు ఆరు ఏర్పాటు చేశారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవటం ద్వారా.. ఫలితాలు తేలిపోవటమే కాదు.. వైరస్ వ్యాప్తికి అంతో ఇంతో చెక్ పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పాలి.
దేశంలోనే ఈ తరహా పరీక్షల్ని ఏపీలోనే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ తెలంగాణలోని తెలుగువారికి కలిగే సందేహం ఏమిటంటే.. ఇలాంటి ముందస్తుపరీక్షలు సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు చేయరని?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి తెలంగాణలో అందునా హైదరాబాద్ లాంటి మహానగరంలో మరెన్ని చేయాలంటారు?అయినా.. ఇలాంటివేమీ తెలంగాణలో ఎందుకు కనిపించవు కేసీఆర్ సార్?అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఇప్పుడేంటి అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఇప్పుడేంటి కెసిఆర్ మొత్తంగా వదిలేశారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.