తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా ఒక కూటమి తీసుకురావాలన్నది ఎప్పటినుండో చేస్తున్న ఆలోచన. నిన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ కి బీజేపీ మతిపోయే షాకుల మీద షాకులు ఇస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంది. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు పోరాటాలు చేస్తూ ఉన్నారు సరిగ్గా ఇదే సరైన సమయం అని భావించారు ఏమో తెలియదు గానీ కెసిఆర్ ఇటీవల పలువురు జాతీయ నాయకులకు ఫోన్ టచ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా ఇప్పటికే కుమార్ స్వామి కి ఫోన్ చేశారన్న వాదన కూడా వినబడుతోంది. అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మమతాబెనర్జీతో చాలా క్లోజ్ గా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ఆమెతో జాతీయ రాజకీయాల మాట్లాడాలన్నా ఆమె ఎన్నికల హడావిడి లో ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీకి దిగాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఇక నవీన్ పట్నాయక్ తో ముందుకు వెళ్లాలన్న ఆయన.. ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితిలో కనబడటం లేదు.
ఇక స్టాలిన్ అయితే ఇంక యూపీఏ తో జత కడుతూ రాణిస్తున్నారు. అయితే మొదటి నుండి కెసిఆర్ జాతీయ రాజకీయాల విషయం గురించి మాట్లాడుతూ.. జాతీయ పార్టీలు అయిన కూటములు అయినా యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఎప్పుడైతే పడిపోతాయి అప్పుడు దేశం బాగుపడుతుందని మొదటి నుండి బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు కూటములలో లేకుండా ఉన్న నాయకుడు చంద్రబాబు. ఇటువంటి తరుణంలో చంద్రబాబుని కలుపుకుంటూ పోతు.. ముందుకు సాగితే బెటర్ అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. బాబుతో అడుగులేస్తే జాతీయంగా ఇతర పార్టీల నాయకులను కలుపుకుని పోయే పరిస్థితులు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..వేరే ఆప్షన్ లేకపోవటంతో కేసిఆర్ ఈ సరికొత్త కాంబినేషన్ లేటెస్ట్ స్ట్రాటజీ తో నేషనల్ పాలిటిక్స్ లో రాణించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.