రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కరించడానికి అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షేకవత్ బరిలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కౌన్సిల్ భేటీకి కసరత్తు చేస్తున్నారు. కౌన్సిలింగ్ ముందు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించాలని ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలని నిర్ణయించారు.
ఇటీవల ఏపీ తెలంగాణ మధ్య జల జగడాలు ముదురుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతోంది. తమ కేటాయింపులు అనుగుణంగానే ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు ఏపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాలేశ్వరం, దేవాదుల, తుపాకుల గూడెం… మొత్తం ఏడు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎగువలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఉన్న తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ వాదన. ఇటువంటి తరుణంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
ఎత్తిపోతల తో దక్షిణ తెలంగాణా నికి అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. విభజన చట్టానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకమని తాము పాత ప్రాజెక్టుల నే రీడిజైన్ చేస్తున్నామని తెలంగాణ క్లారిటీ ఇచ్చింది. వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. జల వివాదం పై ఏపీ తెలంగాణ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో అక్టోబర్ 6న జరిగే సమావేశంలో ఇలాంటి వాదనలు వినిపించాలని అనే విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతస్థాయి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఇక వైఎస్ జగన్ తెలంగాణ జల వివాదాలకు సంబంధించి ఇంకోసారి తెలంగాణ జోలికి రాకుండా కేసిఆర్ ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్తి డేటా తో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ముందు తెలంగాణకి నీటి హక్కుల పై ఉన్న విషయాలను తెలియజేయాలని కేసిఆర్ డిసైడ్ అయినట్లు టాక్.