బంగారం అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్నాకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శ ఎం.శివశంకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. సస్పెండ్ అయినా ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను కేరళ హై కోర్ట్ తిరస్కరించిన వెంటనే, ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) ఆధికారులు బుధవారం ఉదయం తిరువనంతపురంలోని త్రివేణి నర్సింగ్ హోమ్ నుండి శివశంకర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు నిమిత్తం కొచ్చి లోని తమ కార్యాలయానికి తరలించారు.
కేరళ బంగారు అక్రమ రవాణా కేసు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరియు కస్టమ్స్ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి. జూలైలో దౌత్య మార్గాల ద్వారా 514.82 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా, యుఎఇ కాన్సులేట్కు అందజేయడానికి ఉద్దేశించిన దౌత్య సామాను నుండి తిరువనంతపురం విమానాశ్రయంలో జూలై 5 న కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయినా స్వప్న సురేష్ తో ఎం.శివశంకర్న్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని కోర్ట్ భావిస్తున్నట్లు జస్టిస్ అశోక్ మీనన్ ఉత్తర్వలలో పేరుకొన్నారు.
సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి 90 గంటలకు పైగా పలు దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారని కాని వారు “అతనిపై ఎటువంటి నివేదికను లేదా నేరారోపణలను సమర్పించలేదు” అని కోర్టు లో పిటిషన్ వేశారు.అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ విభాగం తీవ్రంగ వ్యతిరేకించాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తమ వాదనను వినిపించాయి, ఇపుడు “కస్టోడియల్ ఇంటరాగేషన్” కు అవసరమయ్యే సమయం అని మరియు ఎం. శివశంకర్ ప్రశ్నించినప్పుడు కొన్ని వాస్తవాలపై తప్పించుకునే వ్యక్తిగా ఉన్నారు అని అయిన నిందితులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఎం.శివశంకర్న్ ఈ కేసు లో దోషి అని తేలితే చట్టం ప్రకారం పరిణామాలను ఎదుర్కొంటారని పాలక సిపిఎం వెల్లడించింది. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శ అవడం వల్ల సీఎం రాజీనామా చేయాలి అని ప్రతిపక్షాలు కాంగ్రెస్,బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల విజయన్ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ప్రతిపక్ష నాయకులు ఆందోళనకి దిగారు.