Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు దేశ వ్యాప్తంగా హైలెట్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు.. దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. “నాడు నేడు” అనే కార్యక్రమం.. గ్రామ వాలంటీర్లు- సచివాలయ వ్యవస్థ ఇంకా అనేక జగన్ ఐడియా నుండి వచ్చిన కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించే పరిస్థితి కనిపిస్తోంది. విద్యారంగంలో వైద్యరంగంలో జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల వై.ఎస్ జగన్ కరోనా కారణంగా రాష్ట్రంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను తన వంతు ఆదుకోవడం కోసం ప్రభుత్వం తరఫున.. వారికి పది లక్షల రూపాయలు… వారి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేయటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. వెంటనే ఆ అనాధ పిల్లలని.. గుర్తించాలని సరైన షెల్టర్ కల్పించాలి అని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వారి పేరిట 10 లక్షలు బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ డబ్బును సదరు అనాధలైన పిల్లలకు అవసరమైన రీతిలో ఉపయోగపడే విధంగా జగన్ ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఐడియా ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతోంది. మేటర్ లోకి వెళ్తా కేరళ రాష్ట్రంలో ఇటీవల కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు 3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి రెడీ అయింది.
Read More: YS Jagan: ముందు మోడీ , ఆ తర్వాత జగన్ ఓ ప్రత్యేకత
ఈ డబ్బులు వారి బ్యాంకు అకౌంట్ లో వేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేరళ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో చాలా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని జగన్ మాదిరి నిర్ణయం తీసుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో … వైసీపీ శ్రేణులు దేశం మొత్తం జగన్ ఫాలో అవ్వాల్సిందే అంటూ గర్వ పడే రీతిలో కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాల్లో అనుభవాలు ఉంటే సరిపోదు.. ఎదుటి మనిషి పట్ల మానవత్వం చూపించే ప్రేమ ఉండాలి ఇలాంటి మరికొంతమంది జగన్ ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమాల పట్ల అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా అనాథలైన పిల్లలకు అండగా నిలవాలని దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గా జగన్ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కేరళ అదేవిధంగా దక్షిణాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే తరహా లో రాణించాలని చూస్తున్నట్లు సమాచారం.