విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనపై కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి, 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి @ysjagan గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు pic.twitter.com/i0stSvEloq
— Kesineni Nani (@kesineni_nani) December 21, 2019
మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ’30 కాకపోతే 300 పెట్టు.. ఇంకా కావాలంటే 3000 పెట్టు… నీది నాది ఏమి పోతుంది ప్రజలే కదా నష్ట పోయేది’ అని కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
30 కాకపోతే 300 పెట్టు ఇంకా కావాలంటే 3000 పెట్టు నీది నాది ఏమి పోతుంది ప్రజలే కదా నష్ట పోయేది. pic.twitter.com/E9ZrfeYDMq
— Kesineni Nani (@kesineni_nani) December 21, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?