విజయవాడ: ఏపీలో జగన్ ప్రభుత్వం అభివృద్ధికి బదులుగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే చెప్పండి, తాము చేసి చూపిస్తాని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఏ పని మీద ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి కోసమేనా? లేక సొంత పనుల నిమిత్తం అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారా? అని నిలదీశారు. స్వకార్యాల కోసం ప్రభుత్వం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని నాని ఆరోపించారు. వైసీపీ నేతలు అడ్డుపడినా.. విజయవాడ ప్రజల కోసం అభివృద్ధి చేసిన తీరుతామని స్పష్టం చేశారు.