ఇటీవల ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు మరియు సినిమా స్టార్లు బిజెపిలో జాయిన్ అవుతున్నారు. అయితే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుష్బూ బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా తమిళనాడు లో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఇదిలా ఉండగా బీజేపీలో చేరిన తరువాత కాంగ్రెస్ పార్టీపై చేసిన కామెంట్లకి కుష్బూ తాజాగా క్షమాపణలు చెప్పారు. బిజెపిలో జాయిన్ అయిన తర్వాత 14 వ తారీకు చెన్నైకి ఖుష్బూ రావడం జరిగింది.
ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ మానసిక ఎదుగుదల సరిగ్గా లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుర్ర ఉండదు అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. కుష్బూ చేసిన కామెంట్లు తమిళనాడు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఓ హక్కుల సంస్థ ఖుష్బు పై 30 పోలీస్ స్టేషన్లలో కంప్లీట్ చేసింది. దీంతో వివాదం ఉన్న కొద్దీ పెరిగిపోతున్న తరుణంలో.. ఖుష్బూ పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. రెండు పదాలు తప్పుగా వాడినందుకు క్షమించమని కోరటమే కాకుండా మరోసారి అలాంటి పొరపాటు జరగదని స్పష్టం చేసింది.
స్వతహాగా నాకు నేనుగా పైకి వచ్చిన వ్యక్తిని అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్ లో మాట్లాడతాను అనడం అభ్యంతరకరమైనది అని చెప్పుకొచ్చారు. అదే విధంగా నా కుటుంబ సభ్యులు కొంతమంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చింది. నాకు సమర్థులైన తెలివైన డైనమిక్ బైపోలార్ డిజార్డర్ డిప్రెషన్తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు.